అన్నమయ్య: మదనపల్లె మున్సిపాలిటీలో పని చేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులు తమ విధులను బహిష్కరిస్తూ నేటి నుంచి నిరవధిక సమ్మెలోకి దిగారు. కమిషనర్ ప్రమీలను కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర కమిటీ ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయన్నారు. జేఏసీ పిలుపుమేరకు సమ్మెలో పాల్గొంటున్నామని చెప్పారు. ఇందులో భాగంగా వారు తమ డిమాండ్లను పాత్రికేయులకు తెలిపారు.