NLR: అక్రమ మైనింగ్ వ్యవహారంలో అరెస్టయిన వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మూడు రోజుల పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ నెల్లూరు జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాకాణిని న్యాయవాదుల సమక్షంలో విచారించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాకాణిని మళ్లీ ఆదివారం సాయంత్రం 5 గంటల సమయానికి పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆయన జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.