KMM: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటులో చేర్పించి అధిక ఫీజులు కడుతూ ఇబ్బందులు పడొద్దని ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ శాంత అన్నారు. శుక్రవారం ముదిగొండ మండల మేజర్ గ్రామపంచాయతీలో హై స్కూల్ హెడ్మాస్టర్ శాంత ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న వసతులపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.