HNK: హన్మకొండ మండల కేంద్రానికి చెందిన శ్రీ ధరణి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కళ్లేపు శోభారాణి తెలంగాణ రాష్ట్రానికి మూడవ సారి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యురాలుగా ఎన్నికయ్యారు. ఈమేరకు డిల్లీ ట్రాయ్ డిప్యూటీ అడ్వైసర్ మన్మోహన్ వ్యాస్ ఉత్తర్వులు జారిచేశారు. టెలికాం వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపైన శోభారాణి పోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు.