కోనసీమ: అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులైన చొల్లంగి జాహ్నవి శివ దుర్గ, లేఖన మహాలక్ష్మీలు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని హెచ్ఎం అక్కిరాజు శేషసాయి తెలిపారు. విద్యార్థినులను గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు, ఎంపీటీసీ భవాని శేఖర్, ఎస్ఎంసీ ఛైర్మన్ గోవింద్ శుక్రవారం అభినందించారు.