TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కమిషన్ ముందు ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ప్రాజెక్టులోని ఆర్థిక అవకతవకలు, కంప్లీషన్ సర్టిఫికెట్, నిధులు-బ్యాంకు గ్యారంటీలు, అంచనాల పెంపుపై కమిషన్ ఈటలను క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది. NDSA నివేదిక ఆధారంగా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఈ విచారణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.