NLR: ఆత్మకూరు మండలం ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశించారు. చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.