అన్నమయ్య: మదనపల్లెలోని గంగమ్మ విశేష అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు సుష్మిత్ సాయి అమ్మవారికి వేకువజామునే అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. శుక్రవారం కావడంతో ముఖ్యంగా మహిళలు అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.