సత్యసాయి: హిందూపురం ఎంపీ పార్థసారథి సోమందేపల్లి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా చాలకూరు ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న కుంభాభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అర్చకులు ఆయనను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎంపీ వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ఉన్నారు.