NGKL: కల్వకుర్తి(మం) తోటపల్లిలో దాదాపు రూ. 10 లక్షల నిధులతో మంజూరైన మహిళా సమైక్య సంఘం భవనానికి గ్రామ సర్పంచ్ జోగు రమణమ్మ, గ్రామ కార్యదర్శి లింగం ఆధ్వర్యంలో ఈరోజు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మహిళ సంఘాల సమావేశాలకు భవనం ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.