KMR: పిట్లం మండలం హస్నాపూర్లో విషాదం నెలకొంది. గ్రామలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. హస్నాపూర్ గ్రామానికి చెందిన పోతూ రాజు సత్యం (41) సోమవారం గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. మృతుడు ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.