MNCL: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం చెన్నూరు మండలంలోని అంగరాజుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్పెషలిస్ట్ వైద్యులతో వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేశారు. 99 రోజుల పాటు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో వైద్య శిబిరాలు నిర్వహించనన్నునట్లు తెలిపారు.