JN: పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు బుధవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పాలకుర్తి మాజీ జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్ రావు హాజరై మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరితమైన 420 హామీలు ఇచ్చింది అన్నారు.