MNCL: మంచిర్యాలలోని కాలేజ్ రోడ్డులో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను బలోపేతం చేయడంలో భాగంగా రూ.129.25 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని సూచించారు.