NLG: మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని DYFI, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఆ గ్రామంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా DYFI మాజీ రాష్ట్ర కార్యదర్శి ఐత విజయ్ మాట్లాడుతూ.. 77 ఏండ్ల స్వతంత్ర భారతంలో గ్రామాలకు సరైనటువంటి రవాణా సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటు అన్నారు.