NGKL: తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరసనలకు దిగారు. కల్వకుర్తి మండలం మార్చాల పాఠశాల ఉపాధ్యాయులు ఇవాళ మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. “హామీలు అమలు ఎప్పుడు, ఉద్యోగుల కష్టాలు ఎప్పుడు తీరుతాయి” అంటూ గళమెత్తారు. ఈ నిరసనతో పాఠశాల ప్రాంగణం నినాదాలతో మార్మోగింది.