KNR: గంగాధర మండలం మధురానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో రూ. 10 లక్షల EGS నిధులతో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ వేముల భాస్కర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తూము రాజు కుమార్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నిధులు అడగగానే కేటాయించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు సర్పంచ్ వేముల భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు.