MNCL: శ్రీరాంపూర్ కాలనీలో అయ్యప్ప స్వాములు ఆదివారం నగర సంకీర్తన నిర్వహించారు. స్థానిక భక్తాంజనేయ దేవాలయం నుంచి ప్రారంభమైన ఈ నగర సంకీర్తన పురవీధుల గుండా సాగగా అయ్యప్ప స్వాములు అయ్యప్ప, గణపతి, కుమారస్వామిల చిత్రపటాలతో పాల్గొన్నారు. అయ్యప్ప నామస్మరణ కీర్తనలు, భక్తి గీతాలతో ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.