NLG: జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. మార్చి మొదటి వారం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో ఉదయం 10 గంటలకే బయట అడుగు పెట్టాలంటే జనం జంకుతున్నారు. జిల్లాలో బుధవారం గరిష్ఠంగా గుడిపల్లిలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది.