NRML: ఖానాపూర్ మండలం బాదన్ కుర్తిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ ప్రారంభించారు. టెంకాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదవారి సొంతింటి కల నెరవేరుతుందన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. లబ్ధిదారులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.