SDPT: హుస్నాబాద్లో ఓ క్రైస్తవ ప్రార్థన మందిరాన్ని అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు కూల్చివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. నిర్వాహకుల ప్రకారం దాదాపు 200 మంది సభ్యులు ఇక్కడ ఆరాధనలు నిర్వహిస్తున్నారు. స్థల వివాదంపై గతంలో కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందన్నారు. ఇప్పటికే పలుమార్లు ధ్వంసం చేసిన మందిరాన్ని మళ్లీ కూల్చివేశారని వాపోయి, బాధ్యులను శిక్షించాలన్నారు.