SDPT: గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి లేఖ రాశారు. గండిపల్లి పనులు కేవలం 40 శాతమే పూర్తయ్యాయని వెంటనే రూ.100 కోట్లు మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గ రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని అన్నారు.