మహబూబాబాద్ జిల్లా నెల్లికుదరు మండలం రామన్నగూడెం గ్రామంలో 65 ఏళ్ల కల్లెపు పద్మను బుధవారం ఇంట్లోకి చొరబడి గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేసి హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహం పరిశీలించి, పోస్టు మార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.