SRD: ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో బుధవారం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్వయుజ మాసం, కృష్ణపక్షం, నవమి తిథి పురస్కరించుకొని పార్వతి సమేత సంగమేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం ధూప దీప మంగళ హారతి నైవేద్యం నివేదన చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు.