KNR: ఇల్లందకుంట PHCలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ క్యాంపులో గర్భిణులు, చిన్నారులతో పాటు కంటి, దంత, ఎముకల సంబంధిత వ్యాధులకు నిపుణులైన వైద్యులు పరీక్షలు చేయనున్నారు.