SDPT: పదవ తరగతి విద్యార్థులకు సర్పంచ్ లావుడియా రాజు నాయక్ అండగా నిలిచారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అంతకపేట పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు ఆయన స్వయంగా ఆటోను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏకాగ్రతతో చదివి, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.