సంగారెడ్డిలో తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విద్యా కమిషన్ నివేదిక పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ నివేదిక ఉపాధ్యాయులను కించపరిచేలా ఉందని మండిపడ్డారు. ఉపాధ్యాయ వ్యతిరేక సిఫార్సులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.