MLG: వెంకటాపూర్ మండల కేంద్రంలో ఆదివారం సురేష్ ఆధ్వర్యంలో పంచాయతీ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా CITU జిల్లా కార్యదర్శి రాజేందర్ హాజరై, మాట్లాడారు. ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న పంచాయతీ కార్మికుల వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నష్టం కలిగించే జీవో 51ని సవరించాలని, MPW విధానాన్ని రద్దు చేయాలన్నారు.