SRD: ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను జోగిపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ మక్త జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రూ.2.50 కోట్లు మంజూరు చేశారని ఆయన తెలిపారు. నేరడిగుంటలో ప్రాథమిక కేంద్రం లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, మంత్రి చొరవతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కళ నేరవేరిందని పేర్కొన్నారు.