NGKL: అంబట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గైనకాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ వివిధ విభాగాల నిపుణులు రోగులకు పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్యాధికారి డాక్టర్ జే.సీ.పీ. యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ లక్ష్మమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.