నాగర్ కర్నూల్ జిల్లా జాగో బంజారా సేన అధ్యక్షుడిగా డాక్టర్ భూపాల్ నాయక్ నియమితులయ్యారు. హైదరాబాద్లోని రాష్ట్ర బంజారా కార్యాలయంలో వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్ మంగళవారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భూపాల్ నాయక్ మాట్లాడుతూ.. బంజారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.