WGL: గత కొద్ది కాలంగా అపరిశుభ్రతతో ఇబ్బందులు పడుతున్న మాదన్నపేట కాలనీవాసుల విన్నపాలపై మున్సిపల్ అధికారులు స్పందించారు. ఇవాళ మున్సిపల్ సిబ్బంది గ్రామంలో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి, రోడ్లు, కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. దుర్వాసన తగ్గడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. కాలనీవాసులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.