కడప: నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర నగరంలోని 6,7,8వ డివిజన్లలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఇవాళ పరిశీలించారు. కార్మికుల మస్టర్ అటెండెన్స్ తనిఖీ చేసి అధికారులు సమయానికి పనులు చేపట్టి నగర పరిశుభ్రతను మెరుగుపరచాలని ఆదేశించారు. జడ్పీ కార్యాలయం వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను తనిఖీ చేసి పరిశుభ్రత, ఆహార నాణ్యతపై సూచనలు చేశారు.