NGKL: ఉగాది పండగ సందర్భంగా ఆర్టీసీ అధికారులు స్పెషల్ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి ఛార్జీలు విపరీతంగా పెంచారు. హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వరకు రూ.140 ఉన్న ఛార్జిని రూ.200 వరకు పెంచారు. దీంతో మహిళలకు ఫ్రీ టికెట్ ఇచ్చి పురుషులకు ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు.