BDK: జిల్లా కేంద్రంలో రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు ఇవాళ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, నిరుద్యోగ జేఏసీ నాయకులు కుమార్ పాల్గొని మాట్లాడారు. మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా మొదటి ఏడాదిలోని రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు.