KMM: ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో గల శ్రీ కోట మైసమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు పవిత్ర బ్రహ్మోత్సవాల జరగునున్నాయి. ఈ మేరకు ఆలయ ఛైర్మన్ డాక్టర్ పర్స పట్టాభి రామారావు, ఈవో కె వేణుగోపాల చార్యులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.