NRPT: ఊట్కూర్ మండల మొగ్ధంపూర్ గ్రామంలోని శివాలయంలో విగ్రహ ప్రతిష్టాపన 14వ దినోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, అలంకరణ కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మహాప్రసాదం పంపిణీ చేయగా.. గ్రామ పెద్దలు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.