BHPL: ఏలేటి రామయ్య పల్లె రైతులను చాందిని సీడ్ కంపెనీ మోసం చేసిందని BJP చిట్యాల మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ఆరోపించారు. మంచి దిగుబడి వస్తుందని చెప్పి 30 ఎకరాల్లో సీడ్ మొక్కజొన్న అందజేసి, కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. క్వింటాకు రూ.3200 చెల్లిస్తామని కంపెనీ బాండ్ ఇచ్చిందన్నారు. ఇందుకు అనుగుణంగా వెంటనే పంట కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.