SRD: సిర్గాపూర్లో ఉగాది పండుగ పురస్కరించుకుని గ్రామస్తుల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. పోటీలు రసవత్తరంగా జరిగాయి. అయితే పైల్వాన్లు హోరాహోరిగా తలపడ్డారు. దాదాపు గంటకు పైగా కుస్తీ కొనసాగింది. పొద్దు మునిగి చీకటి పడగానే సర్పంచ్, పెద్దలు ఫైనల్ పోటీ డ్రా గా ముగించారు. శరత్ పవార్, సిద్దేశ్వర పైల్వాన్లకు సమ ఉజ్జీలుగా ప్రకటించి బహుమతులు ఇచ్చారు.