SRPT: అనంతగిరి మండలం చనుపల్లి గ్రామ శివారులో పాలేరు వాగులో ఇసుక అక్రమ త్రవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలు పట్టించుకోకుండా దళారులు ఇసుక తరలిస్తున్నారని స్థానికులు అంటున్నారు. దీంతో భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని వెంటనే వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.