SRPT: సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్ వద్ద ఇవాళ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. సీలేరు నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్న వీరి వద్ద నుంచి రెండు బైకులు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెంకటయ్య తెలిపారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని, గంజాయి రవాణాపై సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.