VKB: పరిగి మండలం రూప్పైన్పేట్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున NHపై యాక్సిడెంట్ జరిగింది. పోలీసుల వివరాలు.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీ కొట్టడండంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పరిగి మండలం రంగంపల్లి గ్రామానికి చెందిన సుబ్బన్నయ్య (45)గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.