WGL: వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. నిన్న అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. దేవాదాయాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.