KMR: జాతీయ రహదారిపై ఉన్న దాబాలను తనిఖీ చేసి అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయన సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న ప్లాస్టిక్ సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు.