KNR: రామడుగు గ్రామంలో ఈరెళ్ల గౌరమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. శనివారం ఏసీపీ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గౌరమ్మ (55) మహిళను కత్తితో గొంతు కోసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. డబ్బులు, బంగారం విషయంలో తలెత్తిన వివాదంతో తల్లిని చిన్న కుమారుడు అనిల్ కుమార్ హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు.