BDK: భద్రాద్రి జిల్లా ప్రజలకు ఎస్పీ రోహిత్ రాజ్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ.. సహజ సిద్ధమైన రంగులతో ప్రశాంత వాతావరణంలో హోలీ సంబరాలు నిర్వహించుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.