NZB: తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. భీమ్గల్ మండలంలోని తన స్వగ్రామమైన రహత్నగర్లో ఆదివారం పర్యటించారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో నిర్మిస్తున్న దుర్గాదేవి ఆలయ భూమిపూజలో ఆయన పాల్గొన్నారు.