NZB: జక్రాన్ పల్లి మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలలో షీ టీమ్స్ బృందం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో షీ టీమ్స్ పని విధానం, ఒంటరిగా ఉన్నప్పుడు తమను తాము రక్షించుకోవడం గురించి వివరించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, డయల్ 100, టీ సేఫ్ యాప్, మహిళల హక్కులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.