VKB: పరిగి మండల రైతులకు వ్యవసాయ అధికారి రజిత పలు సూచనలు చేశారు. సీసీఐకి పత్తి అమ్మదలిచిన రైతులు తప్పనిసరిగా “కపాస్ కిసాన్ యాప్” నందు ఆధార్ కార్డు లింక్ ఉన్న మొబైల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రైతు స్వయంగా యాప్ డౌన్ లోడ్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉందని, బుక్ అయిన తేదీల్లోనే మిల్లుకు పత్తిని తీసుకెళ్లాలని ఆమె సూచించారు.