BHNG: తుర్కపల్లి మండలం తిర్మలాపూర్లో సీఎం సభకు అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. 6న ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి రూ.వేలాది కోట్ల విలువైన పనులకు సీఎం రేవంత్ రెడ్డి తిర్మలాపూర్లోనే శిలాఫలకాలు వేయనున్నారు. MLA బీర్ల ఐలయ్య ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పర్యవేక్షిస్తుండగా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ పనుల తీరును పరిశీలిస్తున్నారు.